లాక్ డౌన్ కారణంగా గత రెండు నెలలుగా షూటింగ్ లు అన్నీ ఆగిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ప్రభుత్వాలు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో షూటింగ్ లు కూడా మొదలవనున్నాయి. సినిమా థియేటర్లు ఓపెన్ చేసే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అనుమతులు అయితే తెచ్చుకున్నారు కానీ ఇప్పట్లో షూటింగ్ లు మొదలు పెట్టడానికి మాత్రం కాస్త ఆలోచిస్తున్నారట. ఎందుకంటే ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది కానీ పలు నిబంధనలు పెట్టడమే దీనికి కారణం. అన్ని నిబంధనలు పాటించి షూటింగ్ చేయాలంటే మరి కష్టమైన పనే కాబట్టి కాస్త వెనక్కి తగ్గుతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే రాజమౌళి మాత్రం ఒక ట్రయిల్ షూట్ ను నిర్వహిస్తున్నారు. తక్కువ మంది సిబ్బందితో ఆర్ఆర్ఆర్ ట్రయిల్ షూట్ ను ప్లాన్ చేసారు. దాదాపు 200 మందికి పైగా చేయాల్సిన షూట్ ను యాభై మందితో చేస్తారు. హైదరాబాద్ లో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో ఈ ట్రయిల్ షూట్ నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ప్రభుత్వం చెప్పిన నిబంధనలు పాటిస్తూ షూట్ చేయనున్నారు. ఇక రాజమౌళి చేసే ఈ ట్రయిల్ షూట్ కోసం టాలీవుడ్ ఇండస్ట్రీ ఆసక్తి గా ఎదురుచూస్తుంది. ఒకవేళ ఎలాంటి ఇబ్బందులు కనుక లేకుండా ఉంటే అందరూ షూటింగ్ లు మొదలుపెడతారు. లేకపోతే ఏదైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించి ఆ దిశగా వెళ్తారు. మరి రాజమౌళి ఫీడ్ బ్యాక్ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోల కాంబినేషన్ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ఆర్ఆర్ఆర్’. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను ఆధారం చేసుకొని రాజమౌళి ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చింది.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: