ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘పెంగ్విన్’. ఈ నెల 19 వ తేదీన ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టేసారు. ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ ను కూడా చేసేశారు. ఇక వాటికి మంచి రెస్పాన్స్ రావడంతోసినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక కొడుకు కోసం ప్రమాదాలకు ఎదురెళ్లి, సైకో కిల్లర్ ని ఎదిరించిన లేడీ పాత్రలో సురేష్ నటన సినిమాకు మరో ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఈశ్వర్ కార్తీక్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలు తెలియచేశాడు. అంతేకాదు ఈ సినిమా స్క్రిప్ట్ కేవలం 18రోజులలో ఈశ్వర్ పూర్తి చేసి… కేవలం 36రోజుల్లో సినిమా షూటింగ్ పూర్తి చేశారట. అంతేకాదు మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో సైకో కిల్లర్ పాత్ర చేసిన మాస్క్ మాన్ పాత్ర చేసినది ఎవరో కూడా కీర్తి సురేష్ కు చెప్పలేదట. ఎప్పుడో షూటింగ్ చివర్లో కీర్తికి తెలిసిందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను స్టోన్ బెంచ్ ఫిల్మ్స్, ప్యాషన్ స్టూడియోస్ పతాకం పై సూపర్ స్టార్ రజినీకాంత్ పేట సినిమాకు దర్శకత్వం వహించిన కార్తీక్ సుబ్బరాజు నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. తెలుగు, తమిళ్ వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: