కరోనా వల్ల సెలబ్రిటీస్ షూటింగ్స్ మాత్రమే కాదు తమ పుట్టిన రోజు, పెళ్లి రోజు వేడుకలకు కూడా దూరంగా వుంటున్నారు. ఇక ఈ సందర్భంగా `కింగ్` నాగార్జున కూడా తన పెళ్లిరోజు వేడుకలను చాలా సింపుల్ గా జరుపుకున్నారు. నాగార్జున, అమల నిన్న తమ 28వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ సందర్భంగా అభిమానులు, టాలీవుడ్ సెలబ్రిటీలు నాగ్, అమలకు సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలియజేశారు. వీరందరికి నాగార్జున ట్విటర్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. `ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నాకు విషెస్ తెలియజేసిన అందరికీ ధన్యవాదాలు. అందరూ క్షేమంగా ఉండండ`ని నాగార్జున ట్వీట్ చేశారు. అమలతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఇక ఎప్పుడూ అక్కినేని ఫ్యామిలీ మెంబెర్స్ తో కలిసి పెళ్లిరోజు జరుపుకునే ఈ జంట ఈసారి మాత్రం వీరిద్దరే ఒంటరిగా జరుపుకున్నట్టు తెలుస్తుంది ఈ ఫోటోను చూస్తుంటే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Thank you all for the blessings in these troubled times 🙏be well my friends!! pic.twitter.com/QzpeRNpdHz
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 11, 2020
కాగా ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్తున్నాడు. దానితో పాటు.. హిందీలో బ్రహ్మాస్త్ర అనే సినిమాను కూడా చేశాడు. అది రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక వీటితో పాటు నాగార్జున, తమిళ హీరో ధనుష్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. ధనుష్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్ర పోషించబోతున్నారట. త్వరలో ఈ సినిమా గురించి ప్రకటన రాబోతోందట.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: