‘కార్తికేయ 2’ లో మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుందని ఆ సినిమా ప్రకటించినప్పటినుండే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా మాత్రం ఈ సినిమా నుండి అనుపమ తప్పుకుంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ సీక్వెల్కు సంబంధించిన స్టోరీ నెరేషన్ను చాలా రోజుల క్రితమే అనుపమకు చెప్పిన చందూ మొండేటి.. తాజాగా పూర్తి స్క్రిప్ట్ను వినిపించగా… అందులో తన పాత్రకు పెద్ద ప్రాధాన్యత లేదని అందుకే సినిమా నుండి తప్పుకుందని జోరుగా వార్తలు సాగాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కానీ ఇప్పుడు ఈ వార్తల్లో నిజం లేదని తెలిసింది. ఈ రూమర్లపై స్పందించిన చందూ మొండేటి.. అనుమప తప్పుకుంటున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ సినిమాలో తన పాత్ర చాలా కీలకం అని క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ లాక్ డౌన్ తీసేసిన తర్వాత షూటింగ్ ను ప్రారంభిస్తామని తెలిపారు.
నిఖిల్, చందు మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ’ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిజానికి ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మరి చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: