ఒక పక్క కరోనా ప్రపంచాన్ని వణికిస్తోంది. మరోపక్క కొన్ని సంఘటనలు చూస్తే దేశం ఎటు పోతుందో అన్న ఆలోచనలు రాకుండా ఉండవు. కేరళలో ఇటీవల వెలుగుచూసిన గర్భిణీ ఏనుగు మృతి ఘటన దేశాన్ని కుదిపేస్తోంది. కేరళ రాష్ట్రం మొత్తానికి ఆపాదిస్తూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఏనుగు మృతికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రాష్ట్ర పోలీసు శాఖ కేసును సీరియస్ గా తీసుకుని విచారణ జరుపుతోంది. తాజాగా ఈ కేసులో పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై హీరోయిన్ తమన్నా కూడా స్పందించింది. ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటోను ట్వీట్ చేసిన తమన్నా.. `నీ నిశ్శబ్దం నిన్ను కాపాడదు. ప్రతీ ప్రాణం ముఖ్యమే కదా.. మనిషైనా.. జంతువైనా..? మనం మారాల్సిన సమయమిది. మనిషిగా జీవించటం మళ్లీ నేర్చుకోవాలి. ప్రేమభావన అలవరుచుకోండి’ అంటూ భావోద్వేగంతో ట్వీట్లో పేర్కొంది.
Your silence will not protect you. Doesn’t every life matter, human or animal? Muting any form of creation is against the universal law. We must unlearn and learn to be human again, express compassion and practice love.#AllLivesMatter #WakeUpWorld pic.twitter.com/Ixzq39ueJC
— Tamannaah Bhatia (@tamannaahspeaks) June 5, 2020
ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ “మూవీ నటిస్తుంది తమన్నా. ఈ సినిమాలో లో కబడ్డీ కోచ్ గా నటిస్తుంది. దీనితో పాటు రెండు బాలీవుడ్ మూవీస్ లో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: