కరోనా నిర్మూలనలో భాగంగా ప్రభుత్వాలు తమ వంతు సాయం అందిస్తుండగా సినీ తారలు కూడా ముందుకొచ్చి పెద్దఎత్తున విరాళాలు అందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ తన వంతు సాయంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు వివిధ రాష్ట్రాల సహాయ నిధులకు రూ.1.30 కోట్లను విరాళంగా ప్రకటించిన సంగతి కూడా విదితమే. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రుల సహాయ నిధులకు కూడా చెరో రూ.5 లక్షలు చొప్పున అందజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు మరోసారి విజయ్ తన పెద్ద మనసుకు చాటుకున్నాడు. పెళ్ళికి వెళ్లి లాక్ డౌన్ లో చిక్కుకున్న 11 మంది అమ్మాయిలను విడిపించినట్టు తెలుస్తుంది. చెన్నై నుండి ఓ 11 మంది అమ్మాయిలు పెళ్లి కోసం అని తూత్తుకుడి వెళ్లారు. అయితే సడన్ గా లాక్ డౌన్ విధించడంతో ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి వచ్చింది. ఉన్న 11మందిలో ఒక్క అమ్మాయే 20 సంవత్సరాల కంటే పెద్దది. మిగిలిన వారందరూ చిన్నవాళ్ళే. ఈ నేపథ్యంలో ఆ అమ్మాయి విజయ్ ఫ్యాన్స్ గ్రూప్ కి టచ్ లో ఉండటంతో ఆ వార్త కాస్త విజయ్ వరకూ వెళ్లడంతో.. వెంటనే స్పందించిన విజయ్ వారికి సాయం చేయాల్సిందిగా ఫ్యాన్స్ కు చెప్పాడట.
కాగా ప్రస్తుతం విజయ్ హీరోగా ‘మాస్టర్’ చిత్రం రూపొందుతోంది. ‘ఖైదీ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన లోకేశ్ కనగరాజ్ ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. లాక్ డౌన్ కారణంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆగిపోయాయి. అయితే తమిళనాడులో పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వడంతో… ఆ పనుల్లో బిజీ గా ఉన్నారు. డబ్బింగ్ పనులను మొదలు పెట్టేసినట్టు సమాచారం. ఈ సినిమాలో విజయ్ సరసన నాయికగా మాళవిక మోహనన్ నటించింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: