టాలీవుడ్ లో మల్టీస్టారర్ మూవీల ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు-వెంకీ, పవన్ కల్యాణ్-వెంకీ, వరుణ్ తేజ్-వెంకీ నానితో కలిసి నాగార్జున మురిపించారు. ఇక రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ ఆర్ఆర్ఆర్ సినిమాలోజూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి ప్రేక్షకులను మైమరపించబోతున్నారు. ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్ తెర పైకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. ఇక ఈ సినిమా తర్వాత లూసిఫెర్ రీమేక్ సినిమా చేయనున్నారు. సాహూ లాంటి భారీ బడ్జెట్ సినిమా తీసిన సుజీత్ అయితే ఈ సినిమాను కరెక్ట్ గా తీయగలడని భావించి చిరు ఈ భాద్యతలు తనకి అప్పగించారు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు సుజీత్.
ఇక ఈ సినిమాల తరువాత బాబీ దర్శకత్వంలో తాను సినిమా చేసే అవకాశం ఉందని చిరంజీవి తెలియజేసిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ బాబీ తనను కలిసి కథ కూడా చెప్పాడని చిరు తెలిపారు. తాజా సమాచారం మేరకు బాబీ డైరెక్ట్ చేయబోయే సినిమా ఓ మల్టీస్టారర్ సబ్జెక్ట్ అని తెలుస్తుంది. అంతేకాదు ఇందులో చిరంజీవితో రానా దగ్గుబాటి నటించే అవకాశాలున్నాయని టాక్ వినపడుతోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజుల ఆగాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: