నటి, గాయని, రచయిత్రి దిగాంగన బిగ్ బాస్ రియాలిటీ గేమ్ షో సీజన్ 9 లో పాల్గొన్నారు. బాలీవుడ్ మూవీస్ లో నటించిన దిగాంగన”హిప్పీ ” మూవీ తో టాలీవుడ్ లో ఎంటర్ అయ్యారు. థ్రిల్లర్ “వలయం” మూవీ లో హీరోయిన్ గా నటించారు. దిగాంగన ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా కబడ్డీ నేపథ్యంలో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




కరోనా మహమ్మారి కారణంగా లాక్ డౌన్ సమయాన్ని ఎలా స్పెండ్ చేస్తున్నారో ఆమె మాటల్లోనే .. చదువుకొనే రోజుల్లో పెయింటింగ్స్ వేసే దానినని, సినీ నటి అయిన తరువాత పెయింటింగ్స్ వేయడానికి సమయం దొరకడం లేదని, లాక్ డౌన్ సమయంలో తన పెయింటింగ్ స్కిల్స్ కు పదునుపెడుతున్నానని, రాధాకృష్ణుల పెయింటింగ్ వేశానని, పుస్తకాలు, పాటలు, డ్యాన్స్, ఆటలు, వంటలు వంటి వాటితో బిజీగా ఉన్నానని, షూటింగ్స్ తో బిజీగా ఉండటంతో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపలేకపోయానని, లాక్ డౌన్ సమయంలో ఆ లోటు భర్తీ చేసుకుంటున్నానని, కరోనా వైరస్ యుద్ధం కాదని, సైనికులు ఎవరూ ఉండరని, వైరస్ తో మనమే పోరాడాలని , మనమే జాగ్రత్తలు తీసుకోవాలని దిగాంగన చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























