25 శాతం మిన‌హా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ‘నారప్ప’

We Have Completed Majority Of Shooting Work For Narappa Says Movie Producer Suresh Babu

తమిళనాట ఘనవిజయం సాధించిన ‘అసురన్’కి రీమేక్‌గా తెలుగులో ‘నారప్ప’ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కిస్తున్నాడు. ఇందులో వెంకీకి జోడిగా ప్రియమణి నటిస్తోంది. డి.సురేష్ బాబు, కలైపులి ఎస్.థాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు అందిస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నారప్ప’ చిత్రీకరణకు సంబంధించి వివరాలు వెల్లడించారు నిర్మాతలలో ఒకరైన డి.సురేష్ బాబు. ఏకధాటిగా జరిగిన షెడ్యూల్‌లో 75 శాతం చిత్రీకరణ పూర్తయిందని.. కేవలం 25 శాతం మాత్రమే చిత్రీకరించాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. లాక్ డౌన్ పిరియడ్ అనంతరం.. ‘నారప్ప’ షూటింగ్‌ను పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.

మరి.. తమిళనాట ఘనవిజయం ‘అసురన్’ కథాంశం.. తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − 5 =