‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’, ‘అల వైకుంఠపురములో’ చిత్రాల్లో జంటగా నటించి అలరించారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే. ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. దీంతో.. ఈ జోడీకి తెలుగునాట ఎనలేని క్రేజ్ నెలకొంది. ఆ క్రేజ్కి తగ్గట్టే త్వరలోనే బన్నీ, పూజ జోడీ ముచ్చటగా మూడోసారి జట్టుకట్టనుందని సమాచారం. అయితే, బన్నీ సినిమాలో ఈసారి నాయికగా కాకుండా.. ఓ ప్రత్యేక గీతం కోసం పూజ సందడి చేయనుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. ‘ఆర్య’, ‘ఆర్య 2’ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్, బన్నీ కాంబినేషన్లో ‘పుష్ప’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికా మందన్న నాయికగా నటిస్తోంది. కాగా.. ఈ చిత్రంలో ఓ ప్రత్యేక గీతానికి స్కోప్ ఉందని.. ఆ పాట కోసం పూజా హెగ్డేతో సంప్రదింపులు జరుగుతున్నాయని వినికిడి. అదేగనక నిజమైతే.. ‘రంగస్థలం’లోని “జిగేల్ రాణి” తరువాత పూజా హెగ్డే చేసే స్పెషల్ సాంగ్ ఇదే అవుతుంది.
మరి, ‘రంగస్థలం’ తరువాత సుక్కు కాంబినేషన్లో పూజ చేస్తున్న ఈ స్పెషల్ నంబర్ తన కెరీర్కి ఏ మేరకు ప్లస్ అవుతుందో చూడాలి. అలాగే.. బన్నీ, పూజా జోడీ హ్యాట్రిక్ అందుకుంటుందా? అన్న అంశం కూడా ఆసక్తికరమే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: