యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్లో ఓ భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ అధినేత సి.అశ్వనీదత్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. సైన్స్ ఫిక్షన్ మూవీగా రూపొందనున్న ఈ సినిమాకి సంబంధించి దర్శకుడు నాగ్ అశ్విన్.. తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని సమాచారం. అంతేకాదు.. లాక్ డౌన్ పిరియడ్ ముగిసిన తరువాత చిత్రీకరణకు సంబంధించిన పనులు మొదలవుతాయని వినిపిస్తోంది.
ప్రస్తుతం ప్రభాస్ ఓ పిరియాడిక్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తున్న ఈ హై బడ్జెట్ మూవీని ‘జిల్’ దర్శకుడు రాధాకృష్ణ తీర్చిదిద్దుతున్నాడు. సింహభాగం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో తెరపైకి రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: