‘కేజీఎఫ్’ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా ఖాయమేనట..!

ప్రభాస్ తో కేజీఎఫ్ డైరెక్టర్ సినిమా.. ఇది ఎప్పటినుండో వస్తున్న వార్తలే. అప్పట్లో ప్రశాంత్ నీల్ ప్రభాస్ ను కలిసి ఓ కథను వినిపించాడని… ఇక ప్రభాస్ కు కథ నచ్చి ఓకే చెప్పినట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇంతవరకూ ఆ వార్తలపై క్లారిటీ రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం… ఈ డైరెక్టర్ తో ప్రభాస్ తో సినిమా ఖాయమైనట్టే వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ సినిమా సీక్వెల్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నారుఅది పూర్తయిన తరువాత ప్రభాస్ స్క్రిప్ట్ పై కూర్చుంటాడని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. కరోనా వల్ల ప్రస్తుతం షూటింగ్ కు బ్రేక్ పడింది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జగపతి అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత అశ్విన్ తో ప్రభాస్ 21 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్‌తో సైన్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రం షూటింగ్‌ను ఈ ఏడాది చివర్లో ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇక ఈ రెండు సినిమాలు తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా వుండబోతుందట. మరి దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =