పాతతరం లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ , కృష్ణ మల్టీ స్టార్ సినిమాలు చాలానే చేశారు. ఒకపక్క సోలో హీరోగా చేసినా కూడా మరోపక్క వేరే హీరోలతో కలిసి స్క్రీన్ ను పంచుకునేవాళ్ళు. అయితే ఆ తర్వాత మాత్రం ఈ మల్టీ స్టారర్ సినిమాలకు బ్రేక్ పడిందని చెప్పొచ్చు. ఎన్నో ఏళ్ళ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో వెంకీ, మహేష్ బాబు మల్టీ స్టారర్ రావడంతో మరోసారి టాలీవుడ్ లో మల్టీ స్టారర్ సినిమాలకు బీజం పడింది. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో విక్టరీ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మహేష్. చిన్నోడా.. పెద్దోడా అంటూ ఆడియన్స్ ను అలరించి హిట్ కొట్టారు. ఈ తరం హీరోలు మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి పునాది వేసింది. ఆ సినిమా లా ఇప్పటికి చాలా మల్టీ స్టారర్ సినిమాలే వచ్చాయి. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా రాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు మరో పెద్ద మల్టీ స్టారర్ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇంతకి ఎవరితో అనుకున్నారా..? అగ్రహీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో మల్టీ స్టారర్ ను ప్లాన్ చేసాడట. నిజానికి రాఘవేంద్ర రావు తన 100వ చిత్రంగా ఈ భారీ మల్టీస్టారర్ చేయాలని అనుకున్నాడట.ఇక ఆ సినిమాని అప్పటికి టాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్న మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లు హీరోలుగా అనుకున్నాడు.దానికి త్రివేణి సంగమం అని టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారట. కానీ అప్పుడు గంగోత్రిచేయాల్సి వచ్చింది.
అయితే ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. ఈ మల్టీ స్టారర్ ను ఇప్పుడు తెరకెక్కించాలని చూస్తున్నాడట. ఈ సారి ఆ సినిమాని తెరకెక్కించే బాద్యతలు తను తీసుకోకుండా తనయుడు ప్రకాశ్ కోవెలమూడికి అప్పగించాలని చూస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాను నిర్మాతగా వ్యవహరించనున్నాడట. మరి ఇదే కనుక నిజమైతే అగ్ర హీరోలు మల్టీ స్టారర్ చేయలేకపోయారే అన్న నిరాశ పోతుంది. చూద్దాం మరి ఇందులో ఎంత నిజముందో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: