ఎంతైనా మెగా స్టార్ మెగా స్టారే. ఎక్కడున్నా తన విభిన్నతను చూపిస్తాడు. ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన చిరు.. చాలా యాక్టీవ్ గా వుంటున్నారు. యంగ్ హీరోలు కూడా చిరు అంత యాక్టీవ్ గా ఉండలేకపోతున్నారు. తన ట్విట్టర్ ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు ట్విస్ట్ లు కూడా ఇస్తున్నారు. ఇటీవలే (సశేషం).. అంటూ ఒక ట్వీట్ పెట్టి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచాడు. ఇక ఇప్పుడు మరోసారి అలాంటి ట్వీట్ చేసి అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ ట్వీట్ ఏంటంటే “సాధారణంగా నా సినిమాలకి సంబంధించిన పాటలను వాటి చిత్రీకరణ సమయంలో పూర్తిగా వింటూ ఆనందిస్తాను. మధ్యలో పాజ్ చేయడానికి నేను ఇష్టపడను. కానీ ఇటీవల ఒక పాటను మాత్రం తరచూ పాజ్ చేస్తూ .. మళ్లీ మొదటి నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నాను. అందుకు కారణం ఏమిటనేది రేపు ఉదయం 9 గంటలకు చెబుతాను” అని చెప్పుకొచ్చారు. ఇక తెలిసిందేగా కొంచెం హింట్ ఇస్తే చాలు మనోళ్లు అల్లుకుపోతారని..అలానే చిరు ట్వీట్ కి ‘ఆచార్య’ సినిమాకి సంబంధించిన పాట అయ్యుంటుందని.. ఆ పాట గురించి చెబుతారేమో అన్న వార్తలు మొదలయ్యాయి. మరి అదేంటో తెలియాలంటే రేపు ఉదయం వరకు ఆగాల్సిందే.
Usually, when we shoot songs, I thoroughly enjoy listening to them and wouldn’t like interruptions. But recently, I have been enjoying pausing and resuming a song over and again. కారణం … …? …tomorrow morning 9.00 am
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 27, 2020
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: