తెలుగునాట స్టైలిష్ ఫిల్మ్ మేకర్గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు మెహర్ రమేష్. అయితే, తెలుగు చిత్రాల కంటే ముందే కన్నడనాట రెండు విజయవంతమైన చిత్రాలు రూపొందించిన వైనం మెహర్ సొంతం. ‘వీర కన్నడిగ’(‘ఆంధ్రావాలా’కు రీమేక్) ‘అజయ్’(‘ఒక్కడు’ రీమేక్).. ఇలా మెహర్ తెరకెక్కించిన రెండు కన్నడ చిత్రాలు విజయపథంలో పయనించాయి. అనంతరం టాలీవుడ్పై దృష్టి సారించిన మెహర్.. తెలుగులో ‘కంత్రి’(2008), ‘బిల్లా’(2009), ‘శక్తి’(2011), ‘షాడో’(2013) వంటి చిత్రాలను తీర్చిదిద్దాడు. వీటిలో ‘బిల్లా’ చిత్రం మెరుగైన ఫలితాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం అనంతరం తెలుగులో మరో భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఈ స్టైలిష్ ఫిల్మ్ మేకర్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. తెలుగునాట యంగ్ టైగర్ యన్టీఆర్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, విక్టరీ వెంకటేష్ వంటి స్టార్ హీరోలను వరుసగా డైరెక్ట్ చేసిన మెహర్.. త్వరలో మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని చిరు స్వయంగా ప్రకటించడం గమనార్హం.
కాగా ప్రస్తుతం చిరు.. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’లో నటిస్తున్నారు. అదయ్యాక ‘సాహో’ ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో ‘లూసిఫర్’ రీమేక్, ‘వెంకీమామ’ దర్శకుడు కె.ఎస్.రవీంద్ర (బాబీ)తో ఓ మూవీ చేయనున్నారు. ఈ మూడు చిత్రాల తర్వాతే మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు సినిమా ఉంటుంది.
మరి.. చాన్నాళ్ళుగా తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కోసం ప్రయత్నిస్తున్న మెహర్.. చిరు కాంబో మూవీతోనైనా తన అభిలాషను నెరవేర్చుకుంటాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: