‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’, ‘హలో గురు ప్రేమకోసమే’.. ఇలా వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు దర్శకుడు త్రినాథరావు నక్కిన. కాగా, తన తదుపరి చిత్రాన్ని మాస్ మహారాజా రవితేజతో చేయబోతున్నట్టు గత కొంతకాలంగా కథనాలు వస్తున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ వెలుగులోకి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అదేమిటంటే.. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న రవితేజ, త్రినాథరావు కాంబినేషన్ మూవీ.. ఈ ఏడాది నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. ఇంతకుముందు ‘బెంగాల్ టైగర్’లో రవితేజకి జోడిగా నటించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఇందులో నాయికగా నటించబోతోందని టాక్. అంతేకాదు.. ఈ సినిమాలో రవితేజ క్యారెక్టర్ హిలేరియస్గా సాగుతుందని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి మరింత స్పష్టత రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























