ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ చేతిలో రెండు చిత్రాలున్నాయి. అందులో ఒకటి `క్రాక్` కాగా.. మరొకటి `రాక్షసుడు` ఫేమ్ రమేష్ వర్మ రూపొందిస్తున్న యాక్షన్ థ్రిల్లర్. ఈ రెండు సినిమాలతో పాటు… ‘సినిమా చూపిస్త మావ’, ‘నేను లోకల్’ వంటి కామెడీ ఎంటర్టైనర్స్ను తెరకెక్కించిన త్రినాథరావు నక్కినతో కూడా ఓ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ చేయనున్నాడు రవితేజ. కాగా, తాజాగా ఓ మల్టీస్టారర్ మూవీలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మాస్ మహారాజా.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. మలయాళంలో ఘనవిజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కథానాయకులకు స్థానమున్న ఈ చిత్రంలో.. ఇప్పటికే ఓ కథానాయకుడిగా దగ్గుబాటి రానా ఎంపికైనట్టు సమాచారం. కాగా, మరో హీరోగా రవితేజ నటించే అవకాశముందని టాక్. ప్రస్తుతం రవితేజతో ఈ మేరకు సంప్రదింపులు జరుపుతున్నట్టు వినికిడి. త్వరలోనే రవితేజ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హారికా అండ్ హాసిని క్రియేషన్స్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ మల్టీస్టారర్ మూవీ ఈ ఏడాది ద్వితీయార్ధంలో సెట్స్ పైకి వెళ్లనుందని ప్రచారం సాగుతోంది.
మరి.. మలయాళంలో విజయం సాధించిన `అయ్యప్పనుమ్ కోషియుమ్` తెలుగులో కూడా అదే బాటపడుతుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: