కరోనా మహమ్మారి కారణం గా దేశం లో క్లిష్ట పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రజలు శుభ్రత పాటించడం, సామజిక దూరం, ఇళ్ళకే పరిమితం కావడం వంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా రోజు రోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరిగిపోతూనే ఉంది. ప్రజలలో కరోనా వ్యాప్తి నివారణ కై అవగాహన కల్పించడానికి మెగా ఫ్యామిలీ వినూత్నంగా ప్రచారం చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మెగా స్టార్ చిరంజీవి తో పాటు అల్లు అరవింద్, నాగబాబు, వరుణ్ తేజ్, రామ్ చరణ్, ఉపాసన, సుస్మిత, అల్లు శిరీష్, నీహారిక, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, శ్రీజ, కళ్యాణ్ దేవ్ ప్లకార్డ్స్ తో “ఇంట్లో ఉంటూ యుద్ధం చేస్తాం , క్రిమి ని కాదు ప్రేమ ను పంచుతాం, కాలు కదపకుండా కరోనా ను తరిమేస్తాం, భారతీయులం ఒక్కటై భారత్ ను గెలిపిస్తాం ” అంటూ ప్రచారం చేశారు. ఈ ఫోటో ను చిరంజీవి ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ కలసికట్టుగా కరోనా ను ఎదుర్కోగలం, మీ కోసం మరియు భావితరాల కోసం ఇంటికే పరిమితం అవ్వండి అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: