సినిమా సినిమా కు వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు అడివి శేష్. ‘క్షణం’,‘గూఢచారి’న’ఎవరు’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్తో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. రెగ్యులర్ సినిమాలకు దూరంగా ఉంటూ కొత్త మార్క్ ను చూపిస్తూ యంగ్ హీరో లకు పోటీ హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక గత ఏడాది ‘ఎవరు’ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చి మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. వెంకట్ రాంజీ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అడివి శేష్, రెజీనా, నవీన్ చంద్ర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ థ్రిల్లర్ సినిమాలో… ప్రతి సీన్ అద్భుతంగా.. ఊహించని మలుపులు, ట్విస్టులతో ప్రేక్షకులను అలరించింది. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ రెజీనా నటన. నెగెటివ్ షేడ్ లో రెజీనా నటన కూడా అందరికీ నచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక హిట్ సినిమాలను రీమేక్ చేసుకోవడం ఆనవాయితీగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాను కూడా రీమేక్ చేయనున్నారు. కన్నడలో ఈ సినిమాను రీమేక్ చేయనున్నట్టు సమాచారం. యంగ్ శాండల్వుడ్ నటుడు దిగాంత్ అడివి శేష్ పాత్రలో నటించనున్నాడట. ఇక రెజీనా పాత్రలో ఎవరు నటించనున్నారనే దానిపై క్లారిటీ లేదు. ఎవరు సినిమాకు పని చేసిన టెక్నీషియన్సే ఈ రీమేక్ కు కూడా పని చేయనున్నట్టు సమాచారం. మరి తెలుగులో సూపర్ హిట్ అయిన ఈ సినిమా కన్నడలో ఎంత వరకూ సక్సెస్ అవుతుందో చూద్దాం..
ప్రస్తుత అడివి శేష్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో గూఢచారి సీక్వెల్ గూఢచారి 2 కాగా మరొకటి మహేష్ బాబు, సోనీ సంస్థల సంయుక్తంగా నిర్మించనున్న మేజర్. మరి ఈ సినిమాలు ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాయో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: