మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు పలు సందేశాత్మక చిత్రాలలో నటించారు. అలాంటి వాటిలో ‘మరో ప్రపంచం’ ఒకటి. కులం, మతం, అసూయ, ద్వేషం, బాధలు లేని ఓ కొత్త ప్రపంచాన్ని ఈ సమకాలీన సమాజానికి పరిచయం చేసే ప్రయత్నమే ఈ సినిమా. ఇందులో ఏయన్నార్, సావిత్రి జంటగా నటించగా.. జమున, గుమ్మడి, పద్మనాభం, సాక్షి రంగారావు, విజయ్చందర్, మాడా, పుష్పకుమారి, రాధాకుమారి, మీనాకుమారి, సూర్యకాంతం ముఖ్య పాత్రలు పోషించారు. మహాత్మా గాంధీ శతజయంతి సందర్భంగా రూపొందిన ఈ చిత్రాన్ని లెజెండరీ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు తెరకెక్కించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీశ్రీ గీత రచన చేయగా.. కె.వి.మహదేవన్ స్వరాలు సమకూర్చారు. “ఇదిగో ఇదిగో ప్రపంచం”, “అణగారిన బ్రతుకులో”.. వంటి పాటలు ఆలోచింపచేసేలా ఉంటాయి. చక్రవర్తి చిత్ర పతాకంపై అక్కినేని నాగేశ్వరరావు, ఆదుర్తి సుబ్బారావు నిర్మించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. 1970 ఏప్రిల్ 10న విడుదలైన ‘మరో ప్రపంచం’.. నేటితో ఐదు దశాబ్దాలను పూర్తి చేసుకుంటోంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: