కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టే చర్యల నిమిత్తం తమ వంతు సాయం అందించడానికి పలువురు సినీ ప్రముఖలు ముందుకొస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ్, హిందీ ఇలా పలు సినీ పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్లు ఇప్పటికే పెద్ద మొత్తంలో విరాళాలు అందిస్తూనే ఉన్నారు. ఇప్పుడు వీరి జాబితాలో తమిళ్ స్టార్ హీరోయిన్ అజిత్ కూడా చేరిపోయారు. రూ. కోటి 25 లక్షల రూపాయిలను విరాళంగా ప్రకటించారు. ప్రధాన మంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షలును, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలను, అలాగే సినీ వర్కర్స్ యూనియన్ ఎఫ్ఎఫ్ఎస్ఐ కోసం మరో రూ. 25 లక్షలను అజిత్ విరళంగా అందిస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా ప్రస్తుతం అజిత్, దర్శకుడు హెచ్.వినోద్ కాంబినేషన్లో `వలిమై` పేరుతో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్లో అజిత్కి జంటగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు సంగీతమందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: