రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా రూపొందుతోన్న భారీ చిత్రం ‘రౌద్రం రణం రుధిరం’. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తుండగా… ఎన్టీఆర్ కొమురం భీమ్ గా నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ ను పూర్తి చేసుకోగా… కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఈ సినిమాలో పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందులో అజయ్ దేవగన్ కూడా ఒకరు. అయితే ఈ సినిమాలో అజయ్ దేవగన్ ను ఎలా ఎంపిక చేసుకున్నారో చెప్పారు రాజమౌళి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర ఉంటుంది. దాని కోసం ఎవరిని తీసుకోవాలా? అని ఎన్నో రోజులు ఆలోచించాము. ముఖంలో, కళ్ళల్లో నిజాయతీతో పాటు ధైర్యం కనిపించాలి… ఇక ఈ పాత్రకు ఎవరైతే బాగుంటుందని పలువురిని ప్రశ్నించగా. పది మందిలో తొమ్మిది మంది అజయ్ దేవగన్ పేరు చెప్పారని తెలిపారు. ఇక ఆ పాత్ర కోసం ఆయన్ను అడగ్గానే ఒప్పుకున్నారు. నాకెంతో సంతోషం కలిగింది. అజయ్ చాలా అంకితభావం ఉన్న నటుడు” అని రాజమౌళి తెలిపారు. మరి అజయ్ పాత్రను రాజమౌళి ఎంత పవర్ ఫుల్ గా చూపించారో తెలియాలంటే సినిమా రిలీజ్ వరకూ ఆగాల్సిందే.
ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 8వ తేదీన రిలీజ్ చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: