మొత్తానికి మెగా స్టార్ చిరు లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా అన్నా టైప్ లో అలా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారో లేదో.. అందరికంటే చాలా యాక్టీవ్ గా వుంటున్నారు. తన ట్విట్టర్ ద్వారా ఏదో ఒక విషయాన్ని అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే ఇన్ని రోజులుగా చేసిన ట్వీట్స్ ఏమో కానీ చిరు లేటెస్ట్ గా చేసిన ట్వీట్ మాత్రం కాస్త సందేహంలో పడేసింది. తన ట్విట్టర్ వేదికగా ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు చిరు. అదేంటంటే… ఏప్రిల్ 8వ తేదీ.. ఈ తారీకుతో నాకు చాలా అనుబంధం ఉందని చెబుతూ..(సశేషం).. అంటూ తన పోస్ట్ లో తెలిపారు. ఏప్రిల్ 8 తో వున్న సంబంధం గురించి ఏ విషయాన్ని తెలియజేయకుండా డైలమాలో పడేయడంతో.. .ఈ పోస్ట్ పై చిరంజీవి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఆ తేదీతో చిరంజీవికి ఉన్న అనుబంధమేంటో తెలుసుకోవాలని తెగ ఆరాటం పడుతున్నారు. మరి అదేంటో తెలియాలంటే చిరు చెప్పాల్సిందే. ట్వీట్ కోసం ఎదురుచూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#8thApril …… …ఈ తారీఖుతో నాకు బోల్డంత అనుబంధం ఉంది … … … (సశేషం)……to be continued
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 6, 2020
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: