`ఇస్మార్ట్ శంకర్` వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రం `రెడ్`. తమిళ సినిమా `తడమ్` ఆధారంగా తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్కి కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్నాడు. `నేను శైలజ`, `ఉన్నది ఒక్కటే జిందగీ` అనంతరం రామ్, కిషోర్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కాగా ఈ చిత్రం తరువాత మారుతి దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ని చేసేందుకు రామ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు.. మరో క్రేజీ ప్రాజెక్ట్ కూడా రామ్ ఖాతాలో చేరనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ ఇప్పటికే రామ్ కోసం ఓ స్క్రిప్ట్ ని సిధ్ధం చేశాడని, కథ నచ్చడంతో రామ్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కాగా, 13 ఏళ్ళ క్రితమే రామ్, సుకుమార్ కాంబినేషన్లో ‘జగడం’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కిన విషయం విదితమే. వీరిద్దరి కెరీర్లోనూ రెండో సినిమాగా వచ్చిన సదరు చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. మరి.. రాబోయే సినిమా అయినా కాసుల వర్షం కురిపిస్తుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందంటున్నారు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం సుక్కు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: