పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్లో ఓ పీరియాడికల్ మూవీ (`పీకే 27`) రూపొందుతున్న సంగతి తెలిసిందే. మొఘలాయిల పరిపాలనా కాలం నాటి కథతో తెరకెక్కుతున్న ఈ పాన్ – ఇండియా ప్రాజెక్ట్లో.. రాబిన్ హుడ్ తరహా పాత్రలో దర్శనమివ్వనున్నాడు పవన్. అంతేకాదు కోహినూర్ వజ్రం, నెమలి సింహాసనం దొంగతనం.. ఈ అంశాల చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపొందుతోందని టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
`పీకే 27`ని ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తుండగా.. స్వరవాణి కీరవాణి స్వరాలు సమకూరుస్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి ‘విరూపాక్ష’ అనే ఆసక్తికరమైన టైటిల్ను ఎంపిక చేసినట్టు సమాచారం. కాగా, ఈ క్రేజీ ప్రాజెక్ట్లో పవన్కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్, `కంచె` బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. త్వరలోనే టైటిల్, నాయికలపై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: