కరోనా వైరస్ ను అరికట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 21 రోజుల పాటు లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్ల నుండి బయటకు వచ్చే పరిస్థితి లేదు. కరోనాపై పోరాటానికి, ఈ లాక్డౌన్ సమయంలో ప్రజల సహాయార్థం నిధులు అవసరం ఎంతో ఉంది. అందుకే, టాలీవుడ్కి చెందిన పలువురు ప్రముఖులు తమ వంతు సాయంగా ప్రభుత్వాలకు విరాళాలను ప్రకటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా నివారణకు టాలీవుడ్ ప్రముఖులు ఈ రోజు వరుస పెట్టి విరాళాలు అందచేశారు. ఇప్పటికే చిరంజీవి కోటి రూపాయలు, పవన్ 2కోట్లు, రామ్ చరణ్ 70 లక్షలు, మహేష్ బాబు కోటి రూపాయలు, ప్రభాస్ కోటి రూపాయలు ఇంకా డైరెక్టర్ లు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, శివ కొరటాల ఇలా తమ వంతు సాయం చేసారు. ఇప్పుడు ఈ లిస్ట్ లో ఎన్టీఆర్ కూడా చేరిపోయారు. 75 లక్షలు విరాళం అందచేశారు. అందులో 25 లక్షలు తెలంగాణ, 25 లక్షల ఏపీ ప్రభుత్వాలకు.. మిగిలిన 25 లక్షలు సినీ కార్మికులకు అందచేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: