`నేర్ కొండ పార్ వై` (బాలీవుడ్ బ్లాక్ బస్టర్ `పింక్`కి తమిళ్ వెర్షన్) వంటి విజయవంతమైన చిత్రం తరువాత కోలీవుడ్ స్టార్ అజిత్, `ఖాకి` దర్శకుడు హెచ్. వినోద్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా `వలిమై`. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో అజిత్ కి జంటగా హ్యూమా ఖురేషి నటిస్తోంది. యువన్ శంకర్ రాజా సంగీతమందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఇప్పటికే సింహభాగం చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని తొలుత దీపావళికి విడుదల చేయాలని యూనిట్ ప్లాన్ చేసింది. అయితే కరోనా ఎఫెక్ట్ తో సినిమా చిత్రీకరణకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈ నేపథ్యంలో.. `వలిమై`ని దీపావళికి కాకుండా 2021 సంక్రాంతికి రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. త్వరలోనే `వలిమై` రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: