క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమాలో కథానాయికలుగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్ పేర్లు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో పేరు తెరపైకి వచ్చింది. మహానటి సినిమాతో మంచి పేరు దక్కించుకున్న కీర్తి సురేష్ ను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు కీర్తి సురేషే ఫైనల్ అన్న వార్తలు వినిపిస్తున్నాయి. కాగా గతంలో పవన్ కళ్యాణ్ కీర్తి సురేష్ కలిసి అజ్ఞాతవాసి సినిమా చేసిన సంగతి తెలిసిందే.
మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మే15వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: