యంగ్ హీరో నాగశౌర్య-అవసరాల శ్రీనివాస్ కాంబినేషన్ లో మూడో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్ లో మొదట ‘ఊహలు గుస గుసలాడే’ సినిమా రాగా.. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అటు డైరెక్టర్ గా అవసరాల శ్రీనివాస్ కు.. హీరోగా నాగశౌర్య కు మంచి గుర్తింపునిచ్చింది. ఆ తర్వాత జ్యో అచ్చుతానంద సినిమా డైరెక్ట్ చేసిన అవసరాల శ్రీనివాస్ లాంగ్ గ్యాప్ తర్వాత నాగశౌర్యతో మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఆగిపోయిందంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో అనేకవార్తలు వస్తున్నాయి. బడ్జెట్ పెరిగిపోవడం, ఇప్పటివరకు వచ్చిన అవుట్పుట్పై దర్శకనిర్మాతలు అసంతృప్తిగా ఉండటంతో సినిమాను ఆపేసినట్టు ప్రచారం జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వార్తలపై నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ స్పందించి క్లారిటీ ఇచ్చింది. చిత్ర షూటింగ్ 50 శాతం పూర్తయింది. మిగతా షూటింగ్ యూఎస్ఏలో ప్లాన్ చేశాం. వీసాల కోసం వేచి చూస్తున్నాం. యూఎస్ఏ షెడ్యూల్ కూడా త్వరగానే పూర్తిచేస్తాం. ఈ సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలు నిరాధారమైనవి. పుకార్లను నమ్మకండి’అంటూ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ తమ అధికారిక ట్విటర్ ద్వారా తెలిపారు.
.@IamNagashaurya and #AvasaralaSrinivas project is 50% done and rest is to be shot in USA. We are waiting for visas, project is very much shaping up well and rumors of shelving the project are wrong and baseless!
— People Media Factory (@peoplemediafcy) February 26, 2020
ఇదిలా ఉండగా ఈ సినిమాతోపాటు లక్ష్మీసౌజన్య అనే కొత్త దర్శకురాలితో కూడా మరో సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: