సాహో సినిమాతో మంచి హిట్ అందుకున్న ప్రభాస్ ఇప్పుడు మరో సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే కదా. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది. 1970 కాలంనాటి పీరియాడికల్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రం ఇప్పటికే కొన్ని రోజులు షూటింగ్ ను జరుపుకుంది. అయితే మధ్యలో సాహో సినిమా షూటింగ్, ప్రమోషన్లతో బిజీ అయిన ప్రభాస్జాన్ సినిమాకు కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమా బిజీలో పడిపోయాడు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్ గా నటించనున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ ఏ దర్శకుడితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో దర్శకుడు త్రివిక్రమ్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతవరకూ త్రివిక్రమ్ – ప్రభాస్ కాంబినేషనే కుదరలేదు. అందుకే త్రివిక్రమ్ తో తన తదుపరి సినిమా ఉండేలా ప్రభాస్ ప్లాన్ చేసుకుంటున్నాడట. త్రివిక్రమ్ కి ప్రభాస్ ముందుగానే ఒక మాట చెప్పి ఉండటం వల్ల, ప్రభాస్ కి తగిన కథను ఆయన సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం. దానికి తోడు నిన్న వచ్చిన ‘ అల వైకుంఠపురములో’ సినిమా హిట్ అవ్వడంతో ప్రభాస్ కు నమ్మకం ఇంకా ఎక్కువైందట. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో. దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: