ప్రముఖ సినీ రచయిత, నవలా రచయిత, వుమ్మడి రాష్ట్రంలో ఎపీఎస్ ఆర్టీసీ విశ్రాంత చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు ( 81) మృతి పట్ల ప్రింట్ అండ్ ఎలెక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ ( పెన్ ) దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. గతకొంత కాలంగా స్వల్ప అనారోగ్యంతో ఉన్న ఆయన సోమవారం హైదరాబాద్ లోని స్వగృహంలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దివంగత ఆదివిష్ణు మచిలీపట్నంలో 1940 సెప్టెంబర్ 5 న జన్మించారు. హిందూ కళాశాలలో బీ కామ్ చదివిన ఆయన కాలేజ్ రోజుల్లోనే కథలు, నవలలు, నాటకాలు రాయడం ప్రారంభించారు. ఆతరువాత సినిమాలకు రాయడం మొదలుపెట్టారు. ఉద్యోగం చేస్తూనే 40 సినిమాలకు కదరచయితగా, సంబాషకులుగా చిత్ర పరిశ్రమకు సేవలందించిన ఆయన హాస్య రచయితగా గొప్ప ఖ్యాతి గడించారు. ఉషా కిరణ్ మూవీస్ కథా విభాగంలో పనిచేసిన ఘనత వీరికుంది. ఇంటి పేరైన “ఆదివిష్ణు ” పేరుతోనే ప్రసిద్ధికెక్కిన ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు హాస్య కథారచయితగా మంచి పేరుతెచ్చుకున్నారు. సుందరీ సుబ్బారావు, అహనా పెళ్ళంట, జయమ్ము నిశ్చయమ్మురా, ప్రేమా జిందాబాద్, బలమిత్రుల కధ, ఇదాలోకం, కన్నె వయసు, నిజరూపాలు వంటి అనేక చిత్రాలకు కధలు, సంబాషణలు అందించిన ఆదివిష్ణు సుందరి సుబ్బారావు చిత్రానికి ఉత్తమ స్క్రిన్ ప్లె రచయితగా నంది అవార్డు అందుకున్నారు. ఇటీవల చిరంజీవి చేతులమీద సత్కారాన్ని అందుకున్నారు. ఆయన రాసిన అనేక నవల లు , కథలు, వ్యాసాలు నాడు ఆంధ్రపత్రిక,ఆంధ్రప్రభ, జ్యోతి, భారతి వంటి సాహిత్య పత్రికలలో ప్రచురితమైనాయి.నవలా రచయితగా అనేక పురస్కారాలు అందుకున్నారు.
[custom_ad]
“పెన్ ” సంఘ నాయకులు ఆదివిష్ణు అకాల మరణానికి చింతిస్తూ ఆయన పవిత్రాత్మకు శాంతి చేకూరాలని నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో మిత్రులు, సీనియర్ పాత్రికేయులు, నవలా రచయిత నందం రామారావు, పెన్ సంఘ నేతలు బడే ప్రభాకర్, సింహాద్రి కృష్ణ ప్రసాద్, సనకా వెంకటనద ప్రసాద్, సామర్ల మల్లికార్జున రావు, పోతన వెంకటరమణ, రవిచంద్, వంగర శర్మ తదితరులున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: