ఇటీవల కాలంలో ఆడియో పరంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన క్రేజీ ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే… అది `అల వైకుంఠపురములో` అనే చెప్పాలి. ముఖ్యంగా `సామజవర గమన`, `రాములో రాములా` అయితే యూ ట్యూబ్ లో వంద మిలియన్ల మార్క్ ని అవలీలగా అధిగమించేశాయి. అలాగే `బుట్ట బొమ్మ`, `ఓ మై గాడ్ డాడీ` పాటలు కూడా యువతరాన్ని విశేషంగా అలరిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో… `అల వైకుంఠపురములో` చిత్రంలో కథానుసారం పాటల వరుస క్రమం ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తికరమైన విషయం తెలిసింది. వినిపిస్తున్న కథనాల ప్రకారం.. సినిమాలో వచ్చే తొలి పాటగా `ఓ మై గాడ్ డాడీ` ఉంటే, రెండో పాటగా `సామజ వర గమన` వస్తుందట. ఇక మూడో పాటగా టైటిల్ ట్రాక్ `అల వైకుంఠపురములో` వస్తే.. ద్వితీయార్ధంలో తొలి పాటగా, సినిమాలో నాలుగో పాటగా `బుట్ట బొమ్మ` వస్తుందట. ఇక ఐదో పాటగా `రాములో రాములా` ఉంటే.. చివరి పాటగా శ్రీకాకుళం నేపథ్యంలో వచ్చే ఫోక్ సాంగ్ వస్తుందట. మరి.. ఈ ఆర్డర్ ప్రకారమే పాటలు సాగుతాయో లేదంటే మారుతాయో తెలియాలంటే విడుదల తేది వరకు వేచి చూడాల్సిందే.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న `అల వైకుంఠపురములో`కి థమన్ బాణీలు అందించాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: