యాక్షన్ హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా చేస్తున్న సంగతి తెలిసిందే. `సీటీ మార్` అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ సినిమాలో తమన్నా, దిగంగన సూర్యవంశీ నాయికలుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 వేసవిలో థియేటర్లలో సందడి చేయనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలయ్యేలోపు తన లక్కీ డైరెక్టర్ తేజ కాంబినేషన్ లో గోపీచంద్ ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ ని పట్టాలెక్కించబోతున్నట్లు తెలిసింది. ఏప్రిల్ నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని, ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని సమాచారం. మరి.. `జయం, నిజం` చిత్రాల్లో గోపీచంద్ ని విలన్ గా బాగా ఎలివేట్ చేసిన తేజ.. కథానాయకుడిగా అతణ్ణి ఎలా ప్రెజెంట్ చేస్తాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: