మారుతి దర్శకత్వంలో సాయి తేజ్, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లు గా అవుట్ అండ్ అవుట్ ఫుల్ ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా ‘ప్రతిరోజూ పండగే’. టీజర్, ట్రైలర్, సాంగ్స్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా విడుదలకు ముందు పాజిటీవ్ బజ్ ఉండగా.. మూవీ రిలీజ్ అయ్యాక ఆడియన్స్ లో పాజిటివిటి ఎక్కువైంది. దాదాపుగా అన్ని థియేటర్లలన్నీ హౌస్ఫుల్ అయిపోయాయి. రిలీజ్ అయి 13 రోజలు అవుతున్నా కలెక్లన్లు మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత రిలీజ్ అయిన సినిమాలు కూడా ఏవీ పెద్దగా హిట్ కాకపోవడంతో ప్రతిరోజూ పండగే సినిమాకు సంక్రాంతి వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. ఆలోపు మంచి కలెక్షన్సే రాబట్టుకోవచ్చు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈ సినిమా కలెక్షన్స్ పై చిత్రయూనిట్ తాజాగా ఓ అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకూ ఒక్క నైజాంలోనే రూ. 22 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇందులో రూ. 10.59 కోట్ల మేర షేర్ వచ్చినట్లు తెలిపారు. ఒక్క జనవరి 1నే రూ. 2.96 కోట్లు రాబట్టినట్లు వెల్లడించారు. ఇది నాన్ బాహుబలి రికార్డు అని స్పష్టం చేశారు.
కాగా సాయితేజ్ సరసన రాశీ ఖన్నా నటించనగా సత్యరాజ్, రావు రమేశ్ కీలక పాత్రలో కనిపించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఎ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై బన్నీ వాసు ఈ సినిమాను నిర్మించారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: