టాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన బ్లాక్ బస్టర్ కాంబినేషన్స్ లో నటసింహ బాలకృష్ణ, యాక్షన్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను జోడీ ఒకటి. ఇప్పటికే రెండు సెన్సేషనల్ హిట్స్ అందించిన ఈ పవర్ ఫుల్ కాంబో… 2020లో హ్యాట్రిక్ కొట్టేందుకు సిద్ధమవుతోంది. మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇటీవల పూజ జరుపుకోగా… జనవరి మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్ళనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… `సింహా`, `లెజెండ్` తరువాత బాలయ్యతో బోయపాటి రూపొందిస్తున్న ఈ చిత్రంలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంటుందట. ఇందులో భాగంగా… వారణాసి నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు వస్తాయని, ప్రస్తుతం చిత్ర బృందం వారణాసిలో లొకేషన్ల అన్వేషణకు సన్నద్ధమవుతోందని టాక్.
మరి… రెండు బ్లాక్ బస్టర్ల తరువాత బాలయ్య, బోయపాటి కాంబోలో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. థమన్ బాణీలు అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ… 2020 వేసవి చివరలో రిలీజ్ కానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: