దాదాపు దశాబ్దం తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి ఓ ప్రేమకథా చిత్రం వస్తోంది. అయితే.. రెగ్యులర్ లవ్ స్టోరీస్కి భిన్నంగా పిరియాడికల్ టచ్తో ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు ప్రభాస్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్డే నాయికగా నటిస్తుండగా.. `జిల్` ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. గోపీకృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇప్పటికే కొంత మేర చిత్రీకరణ పూర్తిచేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా, ఈ భారీ బడ్జెట్ మూవీకి సంబంధించిన నెక్ట్స్ షెడ్యూల్ నవంబర్లో ప్రారంభం కానుంది. అంతేకాదు… హైదరాబాద్లో జరుగనున్న ఈ షెడ్యూల్కి సంబంధించి ప్రస్తుతం ఓ భారీ సెట్ కూడా తీర్చిదిద్దుతున్నారని సమాచారం. `బాహుబలి` సిరీస్, `సాహో` తరహాలోనే పాన్-ఇండియా మూవీగా రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ 2020 ద్వితీయార్ధంలో తెరపైకి వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: