కథానాయకుడిగానే కాదు బాలనటుడిగానూ స్టార్డమ్ని చూసిన ఘనత సూపర్స్టార్ మహేష్ బాబుది. చైల్డ్ ఆర్టిస్ట్గా 9 సినిమాల్లో నటించిన మహేష్కి… `కొడుకు దిద్దిన కాపురం` ఎనలేని గుర్తింపుని తీసుకువచ్చింది. అంతేకాదు… అందులో వినోద్, ప్రమోద్గా ద్విపాత్రాభినయం చేయడమే కాకుండా… `ఓం నమో నటరాజుకే నమో` అంటూ తన నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒకవైపు తన తండ్రి సూపర్స్టార్ కృష్ణతోనూ, మరోవైపు లేడీ సూపర్స్టార్ విజయశాంతితోనూ కలసి నటిస్తున్నప్పటికీ… చాలా ఈజ్తో డ్యూయెల్ రోల్స్ చేసి మెప్పించాడు మహేష్. పద్మాలయ స్టూడియోస్ పతాకంపై కృష్ణ స్వీయదర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రాజ్-కోటి స్వరాలు అందించారు. ముగ్గురు సూపర్స్టార్స్ (కృష్ణ, విజయశాంతి, మహేష్బాబు) మేలికలయికలో వచ్చిన `కొడుకు దిద్దిన కాపురం`… 1989 సెప్టెంబర్ 21న విడుదలై ఘనవిజయం సాధించింది. అంటే… నేటితో ఈ సినిమా 30 వసంతాలు పూర్తిచేసుకుంటోందన్నమాట.
ఆసక్తికరమైన విషయమేమిటంటే… 30 ఏళ్ళ తరువాత మహేష్, విజయశాంతి `సరిలేరు నీకెవ్వరు`లో కలసి నటిస్తున్నారు. 2020 సంక్రాంతికి రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కూడా సెన్సేషన్ సృష్టించాలని ఆశిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: