‘ఆర్ ఎక్స్100’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ అందుకున్న ఈ ఉత్తరాది సోయగం… ఆపై ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రంలో అతిథి పాత్రలోనూ, ‘సీత’ సినిమాలో ప్రత్యేక గీతంలోనూ మెరిసింది. కాగా… ఏడాదికిపైగా విరామం తరువాత పూర్తిస్థాయి కథానాయిక పాత్రల్లో వరుసగా మూడు చిత్రాలతో సందడి చేయనుంది పాయల్. అంతేకాదు… ఈ మూడు చిత్రాలు కూడా తక్కువ గ్యాప్లోనే రిలీజ్ కానుండడం విశేషం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… పాయల్ ప్రధాన పాత్రలో భాను శంకర్ తెరకెక్కించిన ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ‘ఆర్ డి ఎక్స్ 100’… సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది. అలాగే… ‘విక్టరీ’ వెంకటేష్, యువ సామ్రాట్ నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వెంకీమామ’… అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో పాయల్ హిందీ టీచర్గా దర్శనమివ్వనుంది. అదేవిధంగా… రవితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేషన్లో రూపొందుతున్న ‘డిస్కోరాజా’ డిసెంబర్ 20న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాలో మూగ, చెవిటి అమ్మాయిగా ఛాలెంజింగ్ రోల్ను పోషిస్తోంది పాయల్.
మొత్తానికి… వరుస చిత్రాలతో పాయల్ బాగానే సందడి చేయనుందన్నమాట.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: