తెలుగునాట విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన సంస్థల్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఓ వైపు స్టార్ హీరోలతోనూ… మరోవైపు మీడియం హీరోలతోనూ వరుస చిత్రాలను నిర్మిస్తున్న ఈ సంస్థ… ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ను నిర్మిస్తోంది. ఆ చిత్రాలే… ‘సరిలేరు నీకెవ్వరు’, ‘బంగారు బుల్లోడు’, ‘చాణక్య’. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా… మూడు వేర్వేరు పండుగలకి విడుదల కానున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… యాక్షన్ హీరో గోపీచంద్, తమిళ దర్శకుడు తిరు కాంబినేషన్లో తెరకెక్కిన స్పై థ్రిల్లర్ ‘చాణక్య’… దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ‘అల్లరి’ నరేష్, దర్శకుడు పి.వి.గిరి కలయికలో వస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘బంగారు బుల్లోడు’… దీపావళి సందర్భంగా విడుదల కానుంది. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’… 2020 సంక్రాంతికి ధియేటర్లలోకి రానుంది.
మూడు వేర్వేరు ఫెస్టివల్ సీజన్స్లో రానున్న ఈ మూడు చిత్రాలతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ వరుస విజయాలు అందుకోవాలని ఆకాంక్షిద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: