PVP సినిమా బ్యానర్ పై అడివి శేష్, రెజీనా జంటగా వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది. నవీన్ చంద్ర ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు. ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ లతో అంచనాలు పెంచిన ఎవరు మూవీ ప్రేక్షకాదరణ పొందింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎవరు మూవీ బాగుందని పలువురు సినీ ప్రముఖులు ప్రశంసించిన విషయం తెలిసిందే. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా ఎవరు మూవీ టీమ్ ను అభినందించారు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎవరు మూవీ చాలా బాగుందని, మంచి కాన్సెప్ట్ తో, గొప్ప స్క్రీన్ ప్లే తో తెరకెక్కించారని, అడివి శేష్ సహా మొత్తం మూవీ టీమ్ కు అభినందనలు అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. ఆన్ స్క్రీన్ లోనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా సినిమా ప్రోత్సహిస్తున్న మహేష్ బాబు కు థ్యాంక్స్ అని, మేజర్ మూవీ తో మిమ్మల్ని గర్వపడేలా చేస్తానని మహేష్ బాబు కు అడివి శేష్ రీ ట్వీట్ చేశారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: