‘శ్రీమంతుడు’, ‘జనతా గ్యారేజ్’, ‘రంగస్థలం’ చిత్రాలతో హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న మైత్రీ మూవీ మేకర్స్… త్వరలో మరో మూడు భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాటిలో మొదటిది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న చిత్రం కాగా… రెండోది సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మించనున్న సినిమా. ఇక మూడో భారీ బడ్జెట్ మూవీ యంగ్ టైగర్ యన్టీఆర్, ‘కె.జీ.ఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందనున్న యాక్షన్ ఎంటర్ టైనర్. వీటిలో బన్నీ, సుక్కు కాంబినేషన్ మూవీ ఈ ఏడాది నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్టు ప్రచారం జరుగుతుండగా… వచ్చే ఏడాది ద్వితీయార్థంలో మహేష్, తారక్ సినిమాలు పట్టాలెక్కనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా… ఈ క్రేజీ కాంబినేషన్ మూవీస్ పై త్వరలో మరింత క్లారిటీ వస్తుందేమో చూడాలి.
[youtube_video videoid=w-ZjB-5u_hQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: