తెలుగునాట ఎందరో కథానాయకులు సందడి చేసారు. వారిలో కొందరు మాత్రమే స్టార్ డం చూసారు. అలా… స్టార్ డమ్ చూసిన కథానాయకుల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ది స్పెషల్ ట్రాక్ రికార్డ్. ఎందుకంటే… సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా పరిశ్రమలోకి అడుగుపెట్టిన మహేష్… అటు బాల నటుడిగానూ, ఇటు కథానాయకుడిగానూ … రెండు విధాలా స్టార్ డమ్ చూసాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తొమ్మిది చిత్రాల్లో సందడి చేసిన మహేష్… హీరోగా పాతిక చిత్రాల మైలురాయిని చేరుకున్నాడు. అలాంటి మహేష్ బాబు… కథానాయకుడిగా తొలి అడుగులు వేసిన చిత్రం ‘రాజకుమారుడు’. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు రూపొందించిన ఈ చిత్రంలో మహేష్ సరసన బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింతా కథానాయికగా నటించగా… ప్రకాష్ రాజ్, సుమలత, శ్రీహరి, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో దర్శనమిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ సంగీత సారథ్యంలో రూపొందిన గీతాలన్నీ విశేషాదరణ పొందాయి. “గోదారి గట్టుపైన”, “ఎందుకీ ప్రాయమూ”, “రామ సక్కనోడమ్మ”, “బాలీవుడ్ బాలరాజుని”, ” ఎప్పుడెప్పుడు”, “ఇందురుడో చందురుడో”… ఇలా ప్రతీ పాట శ్రోతలను అలరించడం విశేషం. వైజయంతి మూవీస్ పతాకంపై దిగ్గజ నిర్మాత సి.అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం… పలు కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. 1999 జూలై 30న విడుదలై ఘన విజయం సాధించిన ‘రాజకుమారుడు’… నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది. అంటే… కథానాయకుడిగా మహేష్ బాబు ప్రస్థానానికి 20 ఏళ్లు పూర్తవుతున్నాయన్నమాట.
[youtube_video videoid=Brd1RdYsiR0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: