తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో తెలుసు. ఈసినిమాతో హీరోగా వచ్చి ఇప్పుడు ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి తరుణ్ భాస్కర్ హీరోగా..విజయ్ నిర్మాతగా. కింగ్ ఆఫ్ హిల్ బ్యానర్ పై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు విజయ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమాలో తరుణ్ పక్కన నటించే హీరోయిన్ ఖరారు అయింది. గతంలో నిత్యా మీనన్ అన్నారు.. తరువాత తమిళ సీరియల్ నటి వాణి భోజన్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే ఇప్పుడు అవంతిక మిశ్రా అనే అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ అమ్మాయి తెలుగు తెరకు కొత్తేమి కాదు. గతంలో మాయ, మీకు మీరే మాకు మేమే, వైశాఖం వంటి సినిమాల్లో నటించి.. అందరికీ సుపరిచితమే. షమీర్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ మూవీ లో అనసూయ భరద్వాజ్ ఒక కీలక పాత్రలో నటిస్తుంది. మరి ఈ సినిమాను త్వరలోనే పూర్తి చేసి విడుదల చేయనున్నారు.
[youtube_video videoid=PFRLu-3kmGk]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: