కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `మన్మథుడు 2`. 2002లో విడుదలైన `మన్మథుడు`కి మరో వెర్షన్గా తెరకెక్కిన ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. నాగ్కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా… సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా… ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వినిపిస్తున్న కథనాల ప్రకారం… దాదాపు రూ.6.1 కోట్ల మొత్తానికి `మన్మథుడు 2` హిందీ డబ్బింగ్ రైట్స్ పలికాయని సమాచారం. మరోవైపు… ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జోరుగా సాగుతోందని తెలిసింది. నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మించిన `మన్మథుడు 2`… ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
[youtube_video videoid=rstFuW4ZDeU]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: