ఎస్ వి బి సి చైర్మన్ గా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి

2019 Latest Telugu Movie News, Actor Prudhvi Raj To Be Appointed SVBC Channel Chairman, CM Jagan’s special gift to Comedian Prudhvi, Comedian Prudhvi Raj to be Appointed as Sri Venkateswara Bhakti Channel Chairman, Prudhvi Raj As Tirumala bhakti channel chairman, Prudhvi Raj To Be Sri Venkateswara Bhakti Channel Chairman, SVBC New Chairman, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema Latest News
Actor Prudhvi Raj To Be Appointed SVBC Channel Chairman
రంగం ఏదైనా, విషయం ఏదైనా, సందర్భం ఏదైనా, సమయం ఏదైనా నచ్చిన విషయాన్ని, నమ్మిన విషయాన్ని నమ్మకంగా వాదిస్తే, పాటిస్తే  అందుకు తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది అనటానికి ప్రముఖ సినీ హాస్య నటుడు “30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి”ని తాజా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా జగన్ అభిమాని అయిన పృధ్వి ఎన్నికల శంఖారావం మోగటానికి ముందు నుండే వై ఎస్ ఆర్ సి పి పక్షాన ఎంత విస్తృతంగా ప్రచారం చేశారో తెలిసిందే. వై ఎస్ ఆర్ సి పి విజయావకాశాలపై ఆ పార్టీ శ్రేణుల్లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికీ పృధ్వి మాత్రం చెక్కుచెదరని నమ్మకంతో జగన్ కోసం జనం మధ్యకు వెళ్లారు. చిత్ర పరిశ్రమలో తొంబై శాతం మంది అప్పటి అధికార పక్షమైన తెలుగుదేశం మద్దతుదారులుగా ఉన్నప్పటికీ తను మాత్రం వైఎస్సార్సీపీ పక్షాన అదురూ బెదురూ లేని ప్రచారాన్ని నిర్వహించి జగన్ పట్ల తనకున్న అచంచలమైన అభిమానాన్ని చాటుకున్నాడు. తిరుగులేని మెజారిటీతో అధికారంలోకి వచ్చాక పార్టీకి నిస్వార్ధంగా సేవ చేసిన వారందరినీ ఏదో ఒక రూపంలో సంతృప్తి పరుస్తూ వస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పృధ్వి కి ఒక ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన పదవిని కట్టబెట్టనున్నట్లు రూడిగా తెలుస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పదవిలో పృథ్వి నియామకం దాదాపు ఖరారు అయినట్లుగా వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు  ఈ పదవిని నిర్వహించారు. 2008 జులై 7న అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ చేతుల మీదుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రారంభమైంది. మొదట  ఐఏఎస్ అధికారి సీఈవోగా ఛానల్  నిర్వహణ జరిగేది. అయితే 2014 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కె.రాఘవేంద్రరావును చైర్మన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు వైఎస్సార్సీపీ కూడా అదే విధానాన్ని కొనసాగిస్తూ ఎస్ వి బి సి నూతన చైర్మన్ గా పృధ్విని నియమిస్తున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఈ నియామకంపై అధికారిక ఉత్తర్వులు సోమవారం వెలువడ వచ్చునని అధికార వర్గాల భోగట్టా. ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి పట్ల, వైఎస్ఆర్సిపి పట్ల 30 ఇయర్స్ పృథ్వి ప్రదర్శించిన అభిమానానికి అద్భుతమైన ప్రతిఫలం దక్కింది. ప్రస్తుతానికి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ప్రసారాలను అందిస్తున్న ఎస్ వి బి సి పృద్వి చైర్మన్ షిప్ లో ఇతర భారతీయ భాషలకు కూడా విస్తరించి వెంకటేశ్వరుడి సేవలో తరిస్తుందని ఆశిద్దాం.

[subscribe]

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[youtube_video videoid=5nWJNLqCB8I]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − three =