సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘అర్జున్ రెడ్డి’ ఎంత ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా. ఇక ఈసినిమాతో అప్పటికే పెళ్లి చూపులు సక్సెస్ తో ఉన్న విజయదేవరకొండ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరో రేంజ్ కు ఎదిగిపోయాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాను అటు తమిళ్ లోనూ ఇటు హిందీలోనూ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు వర్షన్కు దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి వంగా హిందీ వర్షన్ తెరకెక్కిస్తున్నాడు. కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది. ఇప్పుడు తాజాగా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మే 13 వతేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. జూన్ 21వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
[youtube_video videoid=EPhHbH7FR74]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























