సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం… ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ‘మహర్షి’ తర్వాత మహేష్ బాబు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరూ’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రం చేయబోతున్న విషయం విదితమే. యాక్షన్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ సినిమాని ‘దిల్’ రాజు సమర్పణలో అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నాడని సమాచారం. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం… జూన్ నెలాఖరు నుంచి పట్టాలెక్కనుంది.
కాగా… ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, టాలెంటెడ్ యాక్ట్రస్ రమ్యకృష్ణ కూడా నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం… ఇందులో మహేష్కు అమ్మ పాత్రలో రమ్యకృష్ణ నటించనుండగా… అత్త పాత్రలో విజయశాంతి కనిపించనున్నట్టు తెలుస్తోంది. గతంలో ‘కొడుకు దిద్దిన కాపురం’ (1989)లో మహేష్కు తల్లిగా విజయశాంతి నటించగా… నాని
(2004)లో రమ్యకృష్ణ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది. త్వరలోనే విజయశాంతి, రమ్యకృష్ణ ఎంట్రీపై, పాత్రలపై క్లారిటీ రావచ్చు. 2020 సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=eTCgaFWwKQA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: