ద్విశతాధిక చిత్రాల స్వరకర్త ఎం.ఎం.కీరవాణి తనయుడు కాలభైరవ కూడా తండ్రి బాటలోనే స్వరప్రయాణం చేస్తున్న సంగతి తెలిసిందే. కీరవాణి బాణీలు అందించిన ‘బాహుబలి 2: ది కంక్లూజన్’లోని “దండాలయ్యా” పాటతో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకున్న కాలభైరవ… అనంతరం ‘అరవింద సమేత వీర రాఘవ’లోని “పెనిమిటి” పాటతో శ్రోతలకు మరింత చేరువయ్యాడు. ఇదిలా ఉంటే… ఓ వైపు గాయకుడిగా రాణిస్తూనే… మరోవైపు సంగీత దర్శకుడిగా కూడా తన ప్రతిభను చాటడానికి ఈ యంగ్ టాలెంట్ సిద్ధపడుతున్నట్టు టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… 2014లో యువ కథానాయకుడు నిఖిల్ కు ఘన విజయాన్ని అందించిన చిత్రం ‘కార్తికేయ’. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ను తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా.. తొలి భాగానికి శేఖర్ చంద్ర స్వరాలు అందించగా… ఈ సీక్వెల్కి కాలభైరవ సంగీతం సమకూర్చనున్నాడని సమాచారం. అంతేకాదు… కీరవాణి కూడా ఓ థీమ్ మ్యూజిక్ బిట్తో పాటు, ఓ సాంగ్ ట్యూన్ను బోనస్గా ఇవ్వనున్నారని వినికిడి. మరి… సింగర్గా మెస్మరైజ్ చేస్తున్న కాలభైరవ మ్యూజిక్ డైరెక్టర్గానూ మెప్పిస్తాడేమో చూడాలి. త్వరలోనే కాలభైరవ ఎంట్రీపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
[subscribe]
[youtube_video videoid=sRqrjjqjj6w]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: