కింగ్ నాగార్జున, స్టన్నింగ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు 2’. చి ల సౌ
ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ‘మన్మథుడు’కి సీక్వెల్గా తెరకెక్కుతున్న ఈ సినిమా… ‘మన్మథుడు’ సక్సెస్ మంత్రని ఫాలో అవుతున్నట్టుగా తెలుస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… ‘మన్మథుడు’లో నాగ్ సరసన సోనాలి బింద్రే, అన్షు హీరోయిన్లుగా నటించగా… ఆ చిత్రంలో తొలి పాటగా వచ్చే “వద్దురా సోదరా”లో కీర్తి చావ్లా, రేఖ అతిథి పాత్రల్లో దర్శనమిస్తారు. అంటే… మొత్తంగా నలుగురు కథానాయికలు కనిపిస్తారన్నమాట. కట్ చేస్తే… ఇప్పుడు ఇదే ఫార్ములాని అటుఇటుగా ‘మన్మథుడు 2’ కోసం కూడా ఫాలో అవుతున్నాడు దర్శకుడు.
కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తుండగా… ఓ ప్రత్యేక పాత్రలో బెంగళూర్ బ్యూటీ అక్షర గౌడ కనిపించనుంది. ఇక కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నాగ్ కోడలు, నటి సమంత దర్శనమివ్వనుంది. అంతేకాదు… ఈ సినిమాలో మరో కథానాయిక కూడా అతిథి పాత్ర పోషించనున్నట్టు టాలీవుడ్ టాక్. ఆ నటి మరెవరో కాదు… ‘మహానటి’తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచిన కీర్తి సురేష్. మొత్తమ్మీద… మన్మథుడు
లో నలుగురు కథానాయికలు కనిపించినట్లే… సీక్వెల్లోనూ అదే తీరు కొనసాగనుందన్నమాట. ఏదేమైనా… కీర్తి ఎంట్రీపై క్లారిటీ రావాల్సి ఉంది. నాగార్జున, పి.కిరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది ద్వితీయార్థంలో తెరపైకి రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: