వైవిధ్యభరితమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు క్రిష్. ఇక ఈ ఏడాది… మహానటుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని యన్.టి.ఆర్. కథానాయకుడు
, యన్.టి.ఆర్. మహానాయకుడు
పేర్లతో రెండు భాగాల బయోపిక్గా తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో… క్రిష్ తదుపరి చిత్రం పై ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం… తన అప్ కమింగ్ ఫిలింను హిందీలో రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నాడట క్రిష్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
2015లో అక్షయ్ కుమార్ హీరోగా రూపొందిన ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ చిత్రంతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు క్రిష్. తమిళ చిత్రం ‘రమణ’ (తెలుగులో ‘ఠాగూర్’)కు రీమేక్గా రూపొందిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. ‘గబ్బర్ ఈజ్ బ్యాక్’ సినిమా షూటింగ్ సమయంలోనే క్రిష్తో మరో సినిమా చేయడానికి అక్షయ్ ఆసక్తి చూపించాడట. ఈ నేపథ్యంలో… క్రిష్ తన తదుపరి ప్రాజెక్ట్ను అక్షయ్ తోనే చేపట్టనున్నట్టు సమాచారం. ఇప్పటికే అక్షయ్ను సంప్రదించి కథను చెప్పడం జరిగిందనీ… ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉందని బాలీవుడ్ టాక్. త్వరలోనే క్రిష్, అక్షయ్ కాంబినేషన్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి… రెండో సారి అక్షయ్తో క్రిష్ రూపొందించబోయే ఈ సినిమా కూడా రీమేకా? లేక స్ట్రెయిట్ ఫిల్మా? అన్నది తెలియాలంటే మరి కొంతకాలం వేచి ఉండాల్సిందే.
[subscribe]
[youtube_video videoid=LlHI_pFQSOA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: